తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సీరియల్స్ లో నటించి మెప్పించిన నటి రాగిణి తానూ జీవితంలో పడిన కష్టాలను ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. నటిగా ప్రయాణం ప్రారంభించి 35 యేళ్లు పూర్తయినట్లు రాగిణి వెల్లడించారు. దూరదర్శన్‌లో వచ్చే సీరియల్స్ ద్వారా నా కెరీర్ ప్రారంభం అయింది. తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 


నాకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడే మా పెద్దక్క తీసుకెళ్లి ఒకాయనతో పెళ్లి చేసింది. సరిగ్గా సంవత్సరం కలిసి ఉన్నాం. ఆ సమయంలోనే నాకు బాబు పుట్టాడు. ఆయనకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే చెత్త తిరుగుడు తిరిగే ఫీల్డ్ అనకునేవాడు. నన్ను హింసించడం మొదలు పెట్టాడు' అని రాగిణి తెలిపారు. పెళ్లైన 6 నెలల నుంచే భర్త నన్ను హింస పెట్టడం మొదలు పెట్టాడు. నువ్వు కూడా తప్పుడు తిరుగుళ్లు తిరిగి సంపాదించొచ్చుకదా...అలా ఎందుకు సంపాదించవు అని వేధించేవాడు.


లేకుంటే ఎవడి దగ్గరికైనా వెళ్లి సంపాదించుకురా అని బలవంతం చేసేవాడు' అని రాగిణి గుర్తు చేసుకున్నారు. అలాంటి తప్పుడు పనులు చేయడం ఇష్టం ఉంటే ఎప్పుడో సినిమా హీరోయిన్ అయ్యేదాన్ని, అవన్నీ ఇష్టం లేకనే మామూలు నటిగా ఉన్నాను. అలాంటి నీచం నేను చేయలేనని చెప్పినా వినేవాడు కాదు. అన్నం పెట్టి పోషిస్తావని చెప్పి నమ్మి పెళ్లి చేసుకుని ఇక్కడకు వచ్చాను అని చెప్పి బాధపడ్డా అతడు మారలేదని రాగిణి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: