బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు అన్నీ వరస పరాజయాలుగా మారుతున్నా ఆవిషయాలు లెక్క చేయకుండా తన సినిమాల స్పీడ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఇప్పుడు అతడు మహేష్ మ్యానియాను నమ్ముకుని మహర్షి’ తో కలిసి ధియేటర్లలో కనిపించబోతున్నాడు. 

తేజ దర్శకత్వంలో బెల్లం కొండ శ్రీనివాస్ కాజల్ తో కలిసి నటించిన ‘సీత’ మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిపోయి అంతా ప్రశాంతత ఏర్పడిన తరువాత ‘సీత’ రాబోతోంది. ఈమూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ నటిస్తే అమాయకత ఎక్కువగా ఉండే పాత్రలో బెల్లంకొండ శ్రీను నటిస్తున్నాడు. 

ప్రస్తుతం ఏమాత్రం క్రేజ్ లేని తేజా బెల్లంకొండ శ్రీను కాజల్ ఇలా ముగ్గురూ కలిసి ‘సీత’ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. వాస్తవానికి ఈమూవీ పై క్రేజ్ లేకపోవడంతో ఈమూవీ గురించి అందరికీ తెలిసే విధంగా ‘మహర్షి’ మ్యానియాను వాడుకుంటున్నారు. 

రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘మహర్షి’ మూవీతో ‘సీత’ ట్రైలర్ ను అన్ని ధియేటర్స్ లోను చూపించబోతున్నారు. దీనితో అనుకున్న విధంగా ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈమూవీకి లక్షల సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ‘సీత’ కనెక్ట్ అయిపోతుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజాను తప్పించిన తరువాత తేజ అసహనంతో చాల శ్రద్దపెట్టి ఈ ‘సీత’ ను తీసాడు. దీనితో తన సినిమా విజయంతో బాలయ్యకు ఏవిధంగా పాఠాలు చెపుతాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: