మహేష్ 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. మహేష్ కోసం 3 ఏళ్లు వెయిట్ చేసి మరి వంశీ పైడిపల్లి చేసిన ఈ సినిమాలో మహేష్ మరో కొత్త కథ చెప్పబోతున్నటు తెలుస్తుంది. ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.. మహేష్ మహర్షి మాములు కథ కాదని.. సినిమాలో మహేష్ 3 డిఫరంట్ రోల్స్ లో అందరిని మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర దర్శక నిర్మాతలు ప్రమోషన్స్ లో చెప్పారు. 


స్టూడెంట్ గా డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉంటూ తన కెరియర్ మీద పూర్తి అవగాహన ఉన్న రిషి.. యూఎస్ లో కంపెనీ సిఈఓగా అవుతాడు. అయితే ఫైనల్ గా మళ్లీ రైతు కష్టాల మీద పోరాడుతాడు. ఇది మహర్షి కథ.. అయితే ఈ సినిమాతో మహేష్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సినిమా కథ ఓ పది నిమిషాలు విని పంపించేద్దామని అనుకున్న మహేష్ వంశీతో ఈ సినిమా తీసేలా చేసింది.


స్ట్రాంగ్ కంటెంట్ పవర్ ఉండబట్టే మహేష్ మహర్షిని ఒప్పుకున్నాడు. ఇక రిషి జర్నీలో భాగమయ్యేందుకు మహేష్ ఫ్యాన్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. కచ్చితంగా ఈ సినిమా మరో చరిత్రకు శ్రీకారం చుడుతుందని చెబుతున్నారు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.


సినిమా తప్పకుండా అందరి అంచనాలను అందుకునేలా ఉంటుందనిపిస్తుంది. ఇప్పటికే ఆన్ లైన్ లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవగా ఫైనల్ గా మహర్షి ప్రభంజనాలకు సాక్ష్యులుగా ఉండేందుకు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అంతా సంసిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: