తెలుగు ఇండస్ట్రీలో గత ఏడాది చిన్న చిత్రాలు, కొత్త దర్శకులు, నటులు తమ సత్తా చాటుకున్నారు.  ఇక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ముఖ్య శిష్యుడైన అజయ్ భూపతి దర్శకుడిగా మారి ‘ఆర్ ఎక్స్ 100’చిత్రం తెరకెక్కించాడు.  ఈ చిత్రంలో కొత్త నటులు నటించారు.  హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత్ నటించారు.  అయితే ఈ చిత్రం మొదటి నుంచి కాంట్రవర్సీలు సృష్టి వచ్చింది.  బోల్డ్ కంటెంట్ విపరీతంగా ఉందని చాలా మంది ఫిర్యాదు కూడా చేశారు. 


మొత్తానికి ఈ చిత్రం రిలీజ్ కావడం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం జరిగింది.  ఈ చిత్రం తర్వాత కార్తికేయకు వరుస ఛాన్సలు రావడం మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో  టీఎన్ కృష్ణ దర్శకత్వంలో  కార్తికేయ హీరోగా నటించిన తాజాగా చిత్రం 'హిప్పీ'. ఆ మద్య టీజర్ రిలీజ్ చేశారు.  తాజాగా ఈ  చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.  ఇక ట్రైలర్ విషయానికి వస్తే..ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే.. ప్యారడైజ్ బిగిన్స్.. అదే అమ్మాయి మనల్ని తిరిగి లవ్ చేయడం స్టార్ట్ చేస్తే.. మై ప్యారడైజ్ లాస్ట్'' అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. 


ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే ఇందులో హీరో రొమాంటిక్ సన్నివేశాలు బాగానే కనిపిస్తున్నాయి.  ఇక మరో ముఖ్య పాత్రలో జేడీ చక్రవర్తి కనిపిస్తున్నాడు.   ‘ఇందులో ఇద్దరు అమ్మాయిలను లవ్ చేస్తూ వారిద్దరి మధ్య నలిగిపోతుంటాడు హీరో. 'అమ్మాయిలను చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా..? వాళ్లు ఒక్కొక్క దినం ఒక్కో మాదిరి ఉంటరు’ అని జెడి చక్రవర్తి చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: