మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాకు సంబందించిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో ఈమధ్యనే క్లైమాక్స్ సీన్స్ షూట్ చేశారట్. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది. ఇక సైరా క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయేలా వచ్చాయట. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమా కథ ఆయన చనిపోవడంతోనే ఎండ్ అవ్వాలి.. అలా కాకుండా సైరా సాహసాలను క్లైమాక్స్ లో చూపించి ఆయన చనిపోయినట్టుగా చిన్న సీన్ అది ఎండ్ కార్డ్ లో వేస్తారని తెలుస్తుంది.


ఇక ఈ క్లైమాక్స్ సీన్స్ అనుకున్న దాని కన్నా చాలా బాగా వచ్చాయని చిత్రయూనిట్ సంతోషంగా ఉన్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తైతే సైరా క్లైమాక్స్ ఒక ఎత్తని అంటున్నారు. సినిమా కోసం చాలా మంది రైటర్స్ పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాస్తుంటే.. పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు.


సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్ల పైగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో చిరుకి జోడీగా నయనతార నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా స్పెషల్ రోల్ చేసిందట. ఈమధ్య స్వీటీ అనుష్క కూడా సైరాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని అన్నారు. వీరే కాకుండా బిగ్ బి అమితాబ్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ అంతా ఈ సినిమాలో నటిస్తున్నారు.


సైరా సినిమా సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా ఎఫెక్టివ్ గా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. తప్పకుండా సినిమా తెలుగు ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా తప్పకుండా ఆ అంచనాలకు తగినట్టుగా ఉంటుందనే మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ ఇయర్ దసరా కి రిలీజ్ ప్లాన్ చేస్తున్న సైరా నుండి అఫిషియల్ రిలీజ్ డేట్ రావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: