మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా వచ్చిన మహర్షి గురువారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజైంది. ల్యాండ్ మార్క్ మూవీ స్పెషల్ గా ఉండేందుకు మంచి కథతో వచ్చాడు మహేష్. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన మహర్షి సినిమా అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. ఇక మొదటి రోజే 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మహేష్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.


ఇక ఈ సినిమా రిలీజ్ రోజే ఆన్ లైన్ లో మొత్తం సినిమా లీక్ చేశారు. తమిళ రాకర్స్ లో మహర్షి సినిమా మొత్తం వచ్చేసిందట. థియేటర్ ప్రింట్ తో ఈ సినిమా లీక్ అయినట్టు తెలుస్తుంది. అయితే దర్శక నిర్మాతల చొరవతో ఆ లింక్ తెలుగు రెండు రాష్ట్రాల్లో రాకుండా బ్లాక్ చేశారట. అయినా సరే మిగతా ఏరియాల్లో మహర్షి కలక్షన్స్ మీద పైరసీ ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు. 


స్టార్ హీరోల సినిమాల విషయంలో తమిళ రాకర్స్ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. సినిమా రిలీజ్ నాడే ఆన్ లైన్ లో పెట్టడంతో సినిమా రిజల్ట్ మీద అది బాగా ఎఫెక్ట్ చూపెడుతుంది. మహర్షి సినిమాకు ఆ తాకిడి తప్పేలా లేదు. అయితే నిర్మాతలు ముందే జాగ్రత్త్త పడటంతో కాస్త పర్వాలేదు. ఇక సినిమాకు అన్నిచోట్ల పాజిటివ్ టాక్ రాగా సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ బీభత్సం సృష్టిస్తున్నారు.


దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిమించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ కూడా రవి పాత్రలో మెప్పించాడు. సినిమాలో మహేష్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో తన సత్తా చాటాడు. నటన పరంగా మరోసారి మహేష్ ది బెస్ట్ అనిపించుకునేలా మహర్షి సినిమా ఉంది. సినిమాకు వచ్చిన సూపర్ హిట్ టాక్ తో సూపర్ స్టార్ మహేష్ కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: