బాల‌య్య ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. ఫ‌లితాలు ఎలా ఉన్నా ఆయ‌న త‌న నెక్ట్స్ సినిమాల విష‌యంలో స్పీడ‌ప్ అయిపోతున్నారు. ఇప్ప‌టికే కేఎస్‌.ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాకు ఓకే చెప్పిన ఆయ‌న ఆ త‌ర్వాత బోయ‌పాటికి క‌మిట్ అయ్యాడు. ఇక జై సింహా కాంబోలో వ‌స్తోన్న సినిమాలో బాల‌య్య‌కు ప్ర‌ధాన విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబును ఇప్ప‌టికే తీసుకున్నారు.  బాలయ్య లెజెండ్ లోనే జగపతి బాబు మొదటిసారి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. 


ఇక ఇప్పుడు మ‌రోసారి బాల‌య్య‌తో ఆన్‌స్క్రీన్ మీద ఫైటింగ్‌కు జ‌గ‌ప‌తిబాబు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఓ లేడీ విల‌న్ క్యారెక్ట‌ర్ కూడా ఉంది. ఈ రోల్ కోసం కోలీవుడ్ స్టార్ హీరో శ‌ర‌త్‌కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మిని తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల కాలంలో వ‌ర‌ల‌క్ష్మి లేడీ విల‌న్ రోల్స్ ద్వారా బాగా పాపుల‌ర్ అవుతోంది. ధ‌నుష్ మారి 2, విశాల్ పందెంకోడి 2, మురుగ‌దాస్‌- విజ‌య్ స‌ర్కార్ సినిమాల్లో ఆమె నెగిటివ్ రోల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. 


ఇప్పుడు బాల‌య్య సినిమాలో విల‌న్‌గా చేయ‌డం ఆమెకు పెద్ద క‌ష్టం కాదు. ఇక్క‌డే ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. బాల‌య్య‌కు లేడీ విల‌న్స్ అచ్చిరాలేదు. గ‌తంలో ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు, సీమ‌సింహం సినిమాల్లో బాల‌య్య లేడీ విల‌న్ల‌తో ఢీకొట్టాడు. గ‌తంలో ఓ పాత సినిమాలోనూ ఓ లేడీ విల‌న్‌ను బాల‌య్య ఎదిరిస్తాడు. ఇక డిక్టేట‌ర్‌లోనూ అంతే. ఈ సినిమాలు అన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆడ‌లేదు. 


మ‌రి ఇప్పుడు వ‌ర‌ల‌క్ష్మి లాంటి లేడీ విల‌న్‌తో ఢీ కొడితే పాత సెంటిమెంట్ రిపీట్ అయితే బాల‌య్య - కేఎస్‌.ర‌వికుమార్ సినిమా డిజాస్ట‌రే అవుతుంది. అలా కాకుండా బాల‌య్య ర‌జ‌నీ నరసింహ స్టైల్లో విజయం సాధిస్తే అది కొత్త రికార్డు అవుతుంది. ఏదేమైనా వ‌ర‌ల‌క్ష్మి నెగిటివ్ రోల్తో బాల‌య్య సినిమాపై ఆస‌క్తి పెరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: