టాలీవుడ్ లోకి పందెంకోడి సినిమాతో హీరోగా వచ్చాడు తమిళ హీరో విశాల్.  అయితే విశాల్ కుటుంబ నేపథ్యం మొత్తం తెలుగే అయినా స్థిరపడింది తమిళనాడు.  మొదటి నుంచి సినిమా కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగిన విశాల్ ‘పందెం కోడి’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.  అయితే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కాగా..తెలుగు లో కూడా మంచి సక్సెస్ అయ్యింది. 


ఇక తమిళంలో ఏ సినిమాలో నటించినా దాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేయడం..మంచి విజయం పొందడం విశాల్ కి బాగా కలిసి వచ్చింది.  ఈ మద్య డిటెక్టీవ్, అభిమన్యుడు, పందెం కోడి 2 మంచి సెక్సెస్ సాధించాయి.  విశాల్ ఎప్పుడూ వార్తలో నిలుస్తూ ఉంటాడు. తమిళ నిర్మాతల మండలి చైర్మన్ గా విశాల్ పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా..తన సినిమాలు మత్రం కూల్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు విశాల్.  విశాల్ నటించిన టెంపర్ రీమేక్ చిత్రం అయోగ్య త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. 


ఈ మద్య  హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అనీషా రెడ్డితో విశాల్ నిశ్చితార్థం జరిగింది. ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్ధం అవుతున్నారు. నిశ్చితార్థం హైదరాబాద్ లోనే జరిగింది.  సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలోనే విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహానికి సంబంధించిన వివరాలని కూడా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. విశాల్, అనీషా వివాహం జరగబోయే తేదీ బయటకు వచ్చింది. అక్టోబర్ 9 ఈ వీరిద్దరో వివాహం ఘనంగా జరగనుందట. వివాహవేడుక హైదరాబాద్ లో జరుగుతుందా లేక చెన్నైలో జరుగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: