కియారా అద్వానీ గ్లామర్ డాల్. తెలుగులో టాప్ స్టార్స్ తో ఆడి పాడిన కియారా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది భరత్ అను నేను మూవీతో పరిచయం అయిన కియారా ఆ మూవీ సూపర్ హిట్ తో ఒక్కసారిగా హాట్ ఫేవరేట్ అయిపోయింది. ఆ తరువాత రాం చరణ్ తో వినయ విధేయ రామ మూవీ చేసింది. ఇపుడు బాలీవుడ్లో జోరు చూపిస్తున్న ఈ అమ్మడు మళ్ళీ తెలుగులో పాగా వేసేందుకు ట్రై చేస్తోంది.


అక్కినేని వారసుడు అఖిల్ కొత్త ప్రాజెక్ట్ లో ఇపుడు హీరోయిన్ గా కియారా పేరు వినిపిస్తోంది. ఈ మూవీలో ఆమెతో జంట కట్టాలని అక్కినేని కుర్రాడు కూడా ముచ్చట పడుతున్నాడుట. ఈ మూవీ కనుక ఫిక్స్ ఐతే కియారా అందాలు మరో సారి యూత్ చూసేయొచ్చు. అసలే అఖిల్ మూవీ అంటే రొమాన్స్ తప్పకుండా ఉంటుంది. దాంతో కియారా అందాలు  ఆరేయడమే తరువాయి, ఏరుకోవడానికి కుర్ర గుండెలు తయార్ అంటున్నారు.


ఇక కియారా ఇపుడు బాలీవుడ్లో బిజీ గా ఉందిట. టాలీవుడ్లో అఖిల్ మూవీతో పాటు మరికొన్ని బిగ్ ప్రాజెక్ట్లు ఉన్నాయని అంటున్నారు. మరో మారు మహెష్ సరసన నటించాలని కూడా కియారా అంటోంది. ఏమో సూపర్ స్టార్ మహేష్ ఆమెను తన పక్కన తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి బాలీవుడ్లో షూటింగులు చేస్తున్నా టాలీవుడ్ ని ఏలాలని ఆరాటం మాత్రం కియారాకు పోలేదుగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: