ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి తీస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘RRR’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే గాయం కారణంగా ఇటీవల విశ్రాంతి తీసుకోవడం తో ఇంటికే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ రంజాన్ సందర్భంగా తన తల్లి షాలిని తరఫు బంధువులను కలిసినట్లు...ఈ  సందర్భంగా బంధువులతో  కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫోటోలలో ఎన్టీఆర్.. లక్ష్మీ ప్రణతి.. పిల్లలు అభయ్ రామ్.. భార్గవ్ రామ్ లతో పాటు షాలిని గారు కూడా ఉన్నారు.  ఇక వీరితో పాటు పదిహేను మందికి పైగా చుట్టాలు కూడా ఉన్నారు. ఈ ఫోటో బయటకు రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Image result for JR NTR

ప్రస్తుతం రంజాన్ నెల సందర్భంగా షాలిని గారి ఇంట్లో సందడి నెలకొన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ నెలలో ముస్లిం సోదరులు ఎక్కువగా దానా ధర్మాలు చేస్తుంటారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తల్లి బంధువులతో కలిసి దానధర్మాలు చేసినట్లు టాక్ వినపడుతోంది. దీంతో తన తల్లి విశ్వాసం పట్ల నమ్మకం కనపరుస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన దానధర్మాలు చాలా విలువైనది అని ఎన్టీఆర్ లైఫ్ లోనే ది బెస్ట్ అని కొంతమంది ముస్లిం సోదరులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి ఫ్యామిలీ నే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు.

Image result for JR NTR

బాలకృష్ణ హరికృష్ణ తారకరామారావు గారి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన జరుగుతున్నది. అయితే తాజాగా తన తల్లి షాలినిగారి బంధువులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు దిగడంతో ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో తల్లి గారి గురించి కూడా తెలుసుకుంటున్నారు నందమూరి అభిమానులు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి షాలిని గారిది కర్ణాటక రాష్ట్రం అని సమాచారం. ఎక్కువగా ఎన్టీఆర్ తల్లి గారి బంధువులు కలవాలంటే కర్ణాటక వెళ్తారని ఇండస్ట్రీలో పెద్ద టాక్ కూడా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: