సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా మహర్షి. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఊపిరి వంటి సూపర్ హిట్ తర్వాత వంశీ పైడి పల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. విడుదలైన అన్నీ చోట్ల  సూపర్బ్ రెస్పాన్స్ తో మరో సారీ మహేష్ కి తిరుగు లేదని ప్రూవ్ చేసింది. 


దిల్ రాజు, అశ్వనీదత్, పి.వి.పి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు విమర్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు ఓవర్సీస్ లోనూ 1 మిలియన్ మార్క్ ను చేరుకుంది. యావరేజ్ టాక్ అని అనుకున్న ప్రేక్షకులందరికి డైరెక్టర్ వంశీ పైడి పల్లి షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లోనిర్వహించారు. 
చందమామ వెన్నెల గురించి మహేశ్ బాబు అందం గురించి మనం చెబుతూనే ఉంటామని ప్రముఖ యాంకర్ సుమ ప్రశంసించారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన మహేశ్ బాబు.. సుమకు థ్యాంక్స్ చెబుతున్నానని, ఆమెను సక్సెస్ మీట్ కు వ్యాఖ్యాతగా రావాలని అడగగానే వచ్చినందుకు సంతోషమని అన్నారు. ఆమె వస్తే తనకు ఓ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుందని, ఫంక్షన్ కే ఓ కళ వస్తుందంటూ మహేశ్, సుమ ను పొగడ్తలతో ముంచెత్తారు. సూపర్ స్టారే అంత పెద్ద ఈవెంట్ లో పొగడగానే సుమ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: