డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా "సీత" ట్రైలర్ మహర్షి సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేసిన విషయం విదితమే. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ కి కూడా మహర్షి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికి యుట్యూబ్ లో ఈ ట్రైలర్ ట్రేండింగ్ లోనే ఉంది. ఈ ట్రైలర్ కు నెటిజేన్లు చాల బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ఇప్పటి వరకు 2 మిలియన్ల మార్కు క్రాస్ అయింది ఈ ట్రైలర్.


ట్రైలర్ కే అంత రెస్పాన్స్ వచ్చిందంటే ఇంక సినిమా మీద అంచనాలు భారీగానే ఉంటాయని అందరు అనుకుంటున్నారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం ఎమోషనల్ కంటెంట్ తో కథ అంతా సీత పాత్ర చుట్టూనే తిరుగుతుంది అన్నట్లు ఉంది. ఏప్పట్లాగే మన వాళ్ళు ట్రైలర్ చూడగానే సినిమాను అంచనా వేసి స్టొరీ సిద్దం చేస్కోవడం షరా మాములే కదా.


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ సినిమా చాల ముఖ్యమైనదనే చెప్పాలి. ఏందుకంటే ఈ హీరోకి ఇప్పటి వరకు సరైన హిట్ లేదనే చెప్పాలి కానీ ఏప్పటికప్పుడు తనని అప్డేట్ చేసుకుంటూ కొత్త సినిమాలతో ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు. జయ జానకి నాయక సినిమాతో యాక్టర్ గా బాగా ప్రూవ్ చేసుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.


ఆ సినిమా తరువాత సరైన కధాంశం దొరకలేదు. మొత్తానికి ఈ కొత్త సినిమాతో బెల్లంకొండకు కొత్త ఉత్సాహం వస్తుందో లేదో చూడాలి. డైరెక్టర్ తేజ కూడా "నేనే రాజు నేనే మంత్రి" సినిమాతో మళ్ళీ సక్సెస్ అందుకుని కొత్త ఉత్సాహంతో వచ్చారు. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ సీత సినిమా తీశారు. అయితే ఈ డైరెక్టర్ కు హీరోకి ఈ సినిమా ఎంత వరకు ముందుకు తీసుకుని వెళ్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: