ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ తనకు కెరీర్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటితో సినిమా ఉంటుందని అనుకున్నారు. అనుకోవడమే కాదు... ఎన్టీఆర్ బయోపిక్ సమయంలోను స్వయంగా బోయపాటే అనౌన్స్ చేశాడు.  సినిమా మరికొన్ని రోజుల్లో లాంచ్ కావాల్సి ఉండగా.. ఆ ప్రాజెక్ట్ ను పెండింగ్ లో పెట్టి కెఎస్ రవికుమార్ ప్రాజెక్ట్ కు బాలయ్య గ్రీన్  సిగ్నల్ ఇచ్చేశాడు.  ఈ నెలలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది.  


ఇందులో కోలీవుడ్ స్టార్ నటి, విలన్ క్యారెక్టర్ కు పెట్టింది పేరైనా వరలక్ష్మి శరత్ కుమార్ ఫిమేల్ విలన్ గా చేస్తోంది.  ఈమెతో పాటు హీరో కమ్ విలన్ జగపతి బాబు కూడా విలన్ గా చేస్తున్నాడు.  ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే... జగపతి బాబు ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడట.  తండ్రి కొడుకులా లేదంటే అన్నదమ్ములుగా చేస్తున్నారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.  
అంతకు ముందు డ్యూయెల్ విలన్ రోల్ చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు.  సూర్య... మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన గజినీ సినిమాలో విలన్ ప్రదీప్ రావత్ డ్యూయెల్ రోల్ చేశారు.  క్లైమాక్స్ వరకు ఇది రివీల్ కాకపోవడంతో సినిమాకు ప్లస్ అయింది.  ఇదే విధంగా చాలా సినిమాల్లో జరిగింది.  


బాలకృష్ణ గతంలో చేసిన అశ్వమేధం సినిమాలో విలన్ అమ్రేష్ పురి డ్యూయెల్ రోల్ చేశాడు.  కాకపోతే ఒక పాత్ర చనిపోయిన తరువాత మరో పాత్ర ఎంటర్ అవుతుంది.  అదే విధంగా, వెంకటేష్ పోకిరి రాజా సినిమాలో శరత్ కుమార్ కూడా విలన్ గా డ్యూయెల్ రోల్ లో మెప్పించాడు.  


బాలకృష్ణ.. కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో జగపతిబాబు డ్యూయెల్ రోల్ వైవిధ్యంతో కూడుకొని ఉంటుందని అంటున్నారు.  సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: