‘ఒక లైలా కోసం’  అనే సినిమా తో పరిచయం అయినా పూజ హెగ్డే నాగ చైతన్య సరసన అలరించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ టాక్ మాత్రం సంపాదించుకుంది. ఇలా పరిచయమైన ఈ చిన్నది వరుసగా తమిళ, హిందీ పరిశ్రమల్లో కూడా పెద్ద ప్రాజెక్టులులో పనిచేసింది పూజ. హిందీ లో భారిగా తెరకెక్కిన  మొహంజోదార పెద్ద డిజాస్టర్ గా మారడం తో పూజ హెగ్డే కి బాలీవుడ్ లో ఆఫర్లు కొద్దికాలం పాటు తగ్గాయి.

 

కానీ కాలం కలిసోస్తే మాత్రం ఏది పట్టుకున్న బంగారం గానే మారుతుంది.ఇదే నిజమైంది పూజ హెగ్డే విషయం లో. సక్సెస్ రేట్ లేకపోయిన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది ఈ అమ్మడు. నాగ చైతన్యతో చేసిన సినిమా తరువాత పూజ కి రంగస్థలం సినిమా లో ఐటమ్ సాంగ్ కోసం ఆఫర్ వచ్చింది. ఇంకే హీరోయిన్ అయిన ఈ ఆఫర్ ను వద్దు అనుకునేదేమో ఈ అమ్మడు మాత్రం వచ్చిందే తడువుగా చేసింది.

 

ఆ పాటతో ఏక్కడికో వెళ్లిపోయింది ఆమె కెరీర్. సహజంగా హీరోయిన్ లు ఐటమ్ సాంగ్ చేస్తే మళ్ళీ అదే ఛాన్స్ వస్తుంది కాని ఈ అమ్మడు విషయం లో సీన్ రివర్స్ అయ్యింది. వరసపెట్టి అగ్ర హీరోల సరసన హీరోయిన్ పత్రాలు వచ్చి పడ్డాయే. అలా వచ్చిందే అరవింద సమేత . ఆ సినిమా మంచి హిట్ నే అందుకుంది. దాని తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జతగా సాక్షం అనే సినిమా చేసింది కానీ అది అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు.

 

అయిన సరే ఈ బ్యూటీ కి లక్ వెతుక్కుంటూ మహర్షి సినిమా రూపం లో వచ్చింది, మహర్షి ఇప్పుడొక సెన్సేషనల్ హిట్. దీంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగింది. వెంటనే ప్రభాస్ పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది అలానే బున్ని –త్రివిక్రమ్ సినిమాలో కూడా ఛాన్స్ సంపాదించింది ఈ అమ్మడు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: