ఈ మద్య కొంతమంది దర్శకులు ఒకటీ రెండు చిత్రాలతోనే తామేంటో నిరూపించుకుంటున్నారు. ఆ మద్య అర్జున్ రెడ్డి చిత్రంతో సందీప్ వంగా, ఆర్ ఎక్స్ 100 చిత్రంతో అజయ్ భూపతి లాంటి కొత్త దర్శకులు తమ టాలెంట్ ఏంటో ఇండస్ట్రీలో చూపించారు. దాంతో టాప్ హీరోలు సైతం ఈ కొత్త దర్శకులతో నటించేందుకు సుముఖత చూపిస్తున్నారు.
'ఆర్ ఎక్స్ 100' హిట్ తర్వాత అజయ్ భూపతి తన తదుపరి చిత్రం కోసం టైమ్ ఎక్కువగానే తీసుకున్నారు. అయితే ఆయన తదుపరి చిత్రం పేరుగా 'మహాసముద్రం' వినిపించింది. చైతూ కథానాయకుడిగా ఈ చిత్రం రూపొందనున్నట్టు వార్తలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు చైతూకి ఉన్న మార్కెట్ రేటు కి బడ్జెట్ ఎక్కువ అవుతుందనే కారణంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదనేది తాజా సమాచారం.
దాంతో ఇప్పుడు మాస్ మహరాజ కోసం ఓ కథ సిద్దం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కొంత కాలంగా హిట్ అనే మాటకు దూరంగా వుండిపోయిన రవితేజ, అజయ్ భూపతి టాలెంట్ ను గుర్తించి అవకాశమిచ్చాడని చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.