డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఇస్మార్ట్ శంకర్". ఈ సినిమాలో రామ్ కి జోడీగా సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు సినిమాలలో నటించిన నిధి అగర్వాల్, నభా నటాషా నటిస్తున్నారు. ఛార్మీ, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


గతకొంత కాలంగా అటు హీరో రామ్ కి గానీ ఇటు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి గానీ సరైన హిట్ పడలేదు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కి కూడా టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసినప్పటికి వాటిలో చెప్పుకోదగిన హిట్ ఒక్కటీ లేదు. అందుకే ఈ సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడు పూరీకి.. 'ఇస్మార్ట్' హిట్ ఎంతో అవసరం. ఈ సినిమాతో గనక హిట్ పడితే ఇక ఈ ముగ్గురు మళ్ళీ ఫాం లోకి వచ్చేస్తారు.


అందుకే ఈ సినిమాకోసం ఈ ముగ్గురు ఎంతో కష్టపడుతున్నారట. ఎప్పటిలాగే పూరీ ఈ సినిమాను తన మార్క్ స్టైల్లో తెరకెక్కించడమే కాకుండా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అన్నీ విషయాలలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇక ప్రేక్షకులందరు ఎదురు చూస్తున్న టీజర్‌ను రిలీజ్ చేయడానికి పూరీ బృందం రెడీ  అయిపోయారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఫస్టు టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా పూరీ ప్లాన్ చేశారట.



మరింత సమాచారం తెలుసుకోండి: