జెర్సీ మూవీలో హీరోయిన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందానికి అందం, నటన ఇలా కలగలసిన ఈ కన్నడ అందం స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకుంటూనే ఉన్నారు. ఆమెకు వరస పెట్టి చాన్సులు వస్తాయని కూడా భావించారు. దానికి తగ్గట్టే ఇపుడు ఆమె మంచి ఆఫర్ పట్టేసింది.


నేచురల్ స్టార్ నాని నుండి వచ్చిన 'జెర్సీ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధ శ్రీనాథ్ తన నటనతో ప్రేక్షకుల్నిఆకట్టుకుంది.దీంతో పాటు తమిళంలో ఆమె చేసిన ‘కె 13’ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ వరుస విజయాలతో ఆమెకు ఆఫర్లు పెరిగాయి. హీరో విశాల్ చేయాలనుకుంటున్న కొత్త చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.


ఈ చిత్రం గతంలో విశాల్ చేసిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇరుంబు తిరై’కు సీక్వెల్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా పిఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తాడట. తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమా ఒకేసారి రిలీజ్ కానుంది. ఇది కాకుండా టాలీవుడ్లో సైతం శ్రద్ధకు అవకాశాలు బాగానే ఉన్నాయి. వైవిధ్యమైన కథలు రాసుకునే దర్శకులు ఆమె వైపు చూస్తున్నారు. ఆమె టాలీవుడ్లో స్టార్ హీరోల పక్కన నటించేందుకు రెడీ అవుతోందని కూడా అంటున్నారు. తొందరలోనే దాని వివరాలు కూడా రివీల్ చేస్తారని చెబుతున్నారు. మరి లక్కీ అంటే శ్రద్ధ అనిపించకమానదు.


మరింత సమాచారం తెలుసుకోండి: