'అరవింద సమేత వీర రాఘవ' తో సూపర్ సక్సెస్ అందుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం 'మహర్షి' సక్సస్ ను ఎంజాయ్ చేస్తోంది. వరుణ్ తేజ్ తో "ముకుంద" సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైనప్పటికి సక్సెస్ కోసం మూడేళ్లు ఎదురు చూసిన పూజా హెగ్డే.. ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉంది. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ సరసన నటిస్తూ వరస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పూజా వరుణ్ తేజ్ 'వాల్మీకి' కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.


వరుణ్ తేజ్.. పూజా ఫస్ట్ మూవీ హీరో. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ డీజే ( దువ్వాడ జగన్నాధం ) ద్వారా తనకు బ్రేక్ ఇ చ్చాడు. అందుకనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే పూజా వెంటనే ఓకే చెప్పిందట. అయితే ప్రస్తుతం తను సక్సస్ లో ఉంది కాబట్టి రెమ్యునిరేషన్ బాగా డిమాండ్ చేస్తోందని ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.


రెమ్యునిరేషన్ విషయంలో తన గురించి వస్తున్ననెగిటివ్ టాక్ వల్ల హర్ట్ అయిన పూజా వాల్మీకి ఆఫర్ కి నో చెప్పే ఆలోచనలో ఉందట. అయితే ఇలాంటి విషయాల గురించే వాల్మీకి విషయంలో వచ్చిన రూమర్స్ ని నమ్మొద్దని గతంలో డైరెక్టర్ హరీష్ శంకర్ అందరికి ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు కూడా పూజా విషయంలో హరీష్ చెప్పేవరకు ఏదీ నిజంకాదని ప్రస్తుతం వస్తున్నవన్నీ రూమర్సే అని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: