దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అంటారు పెద్దలు..ఇప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన హీరో, హీరోయిన్లు కొంత మంది అదే పనిమీద ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ సినీ తారలు స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర వ్యాపార సంస్థలు పెట్టి లాభాలు కూడా ఆర్జిస్తున్నారు.  ఐపీఎల్ మ్యాచ్ యాజమానులుగా కొనసాగుతున్నారు.  టాలీవుడ్ లో కూడా కొంత మంది హీరోలు పబ్, రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు.  రకూల్ ప్రీత్ సింగ్ అయితే జిమ్ నిర్వహిస్తున్నారు.  గ‌తంలో నాగార్జున ,చిరు ప్ర‌ముఖ ఛానెల్‌లో భాగ‌స్వామిగా ఉన్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కూడా ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో భాగ‌స్వామి అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు తెలుస్తుంది.  ప్ర‌భాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్‌లు త్వ‌ర‌లో ఓ టీవీ ఛానెల్ ప్రారంభించేందుకు సన్నద్దమవుతున్నారట. అయితే టీవీ ఛానెల్ లో  ప్ర‌భాస్ కూడా భాగ‌స్వామి కానున్నార‌ని అంటున్నారు.అయితే ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ..ప్రభాస్ సినిమాల్లో తక్కువగానే నటిస్తున్నారు..బహుషా ఆయన భవిష్యత్ ప్రణాళికలు వ్యాపార రంగం వైపు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు.

  ఏదేమైన మ‌న స్టార్స్ ఓ వైపు న‌ట‌న‌ని కొన‌సాగిస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగాలపై దృష్టి పెట్ట‌డం విశేషం. ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ బాబు ఏఎమ్‌బీ అనే మ‌ల్టీ ప్లెక్స్‌తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విష‌యం విదిత‌మే. బ‌న్నీ కూడా త్వర‌లోనే ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మించ‌నున్నాడ‌ని అన్నారు. ప్రస్తుతం ప్రబాస్‌ 'సాహో' చిత్రంతో పాటు రాధాకృష్ణ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు , సాహో చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: