సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, పివిపి, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించిన లేటెస్ట్ హిట్ మూవీ మహర్షి. ఇక ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తూ సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతోంది. ఇక ఈ సినిమా చూసినవారందరూ సినిమాలో మహేష్ బాబు, అల్లరి నరేష్ ల అద్భుత నటనను విపరీతంగా ప్రశంసిత్తో పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా వారిద్దరి పాత్రల మధ్య స్నేహం గురించిన ఒక సాంగ్ సినిమాలో చూపించడం జరిగింది. 


నిజానికి సినిమాలో పదరా పదరా, అలానే ఇదే కదా ఇదే కదా అనే పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న "నువ్వని, ఇది నీదని" అనే పల్లవితో సాగే మరొక పాట కూడా సినిమా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుని తాకుతుంది అనే చెప్పాలి. రిషి తాను అనుకున్న గోల్ ని రీచ్ అయ్యాక, అనుకోకుండా పూర్వ స్నేహితుల కలయిక సమయంలో తన ప్రాణ మిత్రుడిని మరిచిపోయిన సందర్భంలో వచ్చే ఈ పాటలో శ్రీమణి లిరిక్స్, దేవి శ్రీ అందించిన మంచి ట్యూన్ అందరిని ఎంతో కదిలిస్తుంది.

ఇక సినిమాలోని ఈ పాట ఆడియోలో విడుదల చేయకపోవడంతో ఈ పాటను కూడా ఆడియో రూపంలో విడుదల చేయాలనీ పలువురు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల కోరికమేరకు ఈ రోజు సాయంత్రం 4.05 నిమిషాలకు యూట్యూబ్ లో విడుదల చేయడం జరుగుతుందని దర్శకుడు వంశీ, సంగీత దర్శకుడు దేవి తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కాసేపటి క్రితం పోస్ట్ చేసారు. 


ఇక సినిమాలో బాగా ఆకట్టుకున్న ఈ పాట, నేడు ఆడియో రూపంలో విడుదలయ్యాక సినిమా విజయానికి మరింత హెల్ప్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఇక నేడు విడుదలవుతున్న ఈ పాట కోసం మహేష్ అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.....


మరింత సమాచారం తెలుసుకోండి: