ఈ మద్య సినిమాల్లో నటించిన వారు..బుల్లితెరపై తమ సత్తా చాటుతుంటే..బుల్లితెరపై నటించిన యాంకర్లు, నటీమణులు వెండితెరపై సత్తా చాటుతున్నారు.  జబర్ధస్త్ కామెడీ షో తో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ, రష్మిలు ఇప్పుడు వెండి తెరపై బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు వెండి తెరపై నటించిన శ్రీముఖ తర్వాత యాంకర్ గా యూటర్న్ తీసుకుంది.  అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంది.  అయితే శ్రీముఖి నటించిన సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. 

దాంతో బుల్లితెర షో 'పటాస్'తో యాంకర్ వచ్చి మంచి క్రేజ్ సంపాదించింది.  దానితో పాలు పలు టివి రియాల్టీ షోలో పాల్గొంటుంది.  ఇక శ్రీముఖికి ‘పటాస్’మంచి బ్రేక్ ఇచ్చింది..ఇందులో  రాములమ్మగా ఆమె చేసే హడావిడి షోలో ఉండే స్టూడెంట్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. తన గ్లామరస్ లుక్స్ తో షోకి అందాన్ని తీసుకొస్తుంది.  ఈ షోలో శ్రీముఖి తో పాటు రవి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీముఖి, రవి హోస్ట్ గా 'పటాస్ 2' కూడా మొదలుపెట్టారు.

కానీ ఇప్పుడు ‘పటాస్ 2’ కి శ్రీముఖి దూరం కాబోతుంది.  ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించడంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంత  కాలం తన అల్లరిని భరించి టివి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.  తనకు ఎంతో ఇష్టమైన షో పటాస్ అని, హృదయానికి చాలా దగ్గరైన షో అని చెబుతూ నిర్మాణ సంస్థ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కి కృతజ్ఞతలు తెలియజేసింది.  మరి సినిమాల్లో ఏమైనా బిజీ కావాలనుకుంటుందా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: