మహేష్ బాబు మహర్షి మూవీ మే 9 న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.  తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న ఈ సినిమా చాలా ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది.  గుంటూరు, కృష్ణ తదితర ప్రాంతాల్లో మహర్షి నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  


ఇదిలా ఉంటె, ఇప్పుడు నైజాంలో ఈ మూవీ జైత్ర యాత్ర అప్రతిహాసంగా కొనసాగుతోంది.  తొలివారంలో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.  తాజా సమాచారం ప్రకారం, మహర్షి నైజాంలో రూ.20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.  రైతుల గురించి, వ్యవసాయం గురించి సినిమాలో అద్భుతంగా చూపించారు.  


సెలెబ్రిటీలతో పాటు ఈ సినిమాను ఉపరాష్ట్రపతి సైతం మెచ్చుకున్నారు.  వీకెండ్ ఫార్మింగ్ కు నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన రావడం సినిమాకు ప్లస్ పోయింగ్ అయింది.  అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి పాత్ర ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దటం విశేషం.  ఇప్పటి ఈ సినిమా వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  లాంగ్ రన్ లో సినిమా రూ. 200 కోట్లు వసూలు చేయడం ఖాయం అని అంటున్నారు సినీ ప్రముఖులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: