మన దేశంలో అత్యంత పేరెన్నికగన్న ఆటల్లో ప్రధమ స్థానంలో నిలిచేది మాత్రం క్రికెట్ అనే చెప్పాలి. ఇక ఈ క్రీడ గురించి మన దేశంలో దాదాపుగా తెలియని వారుండరు. నిజానికి మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ కూడా ఇక్కడ దాని కంటే క్రికెట్ నే ఎక్కువమంది ఇష్టపడుతుంటారు అంటే అతిశయోక్తి కాదు అనే చెప్పాలి. అంతలా మన వాళ్లకు క్రికెట్ అంటే మక్కువ. ఇక మన సెలెబ్రెటీల్లో చాలా మందికి కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. 


అందులోను మన టాలీవుడ్ లో అయితే శ్రీకాంత్, తరుణ్, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు తమకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని పలు మార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక వెంకటేష్ అయితే ఒక మెట్టు పైకేసి మన ఇండియన్ క్రికెట్ మ్యాచెస్, అలానే ఐపీఎల్ వంటి మ్యాచెస్ కు వెళ్లి అప్పుడపుడు దర్శనమిస్తుంటాడు. ఇకపోతే మహేష్ బాబు కూడా ఇటీవల మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో తనకు క్రికెట్ పై ఉన్న అభిమానాన్ని ఇండియా వరల్డ్ కప్ సాధించిన ఘనత చెపుతూ గుర్తుచేసుకున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం వెంకటేష్, మహేష్ ఫ్యామిలీస్ రెండూ ఇంగ్లాండ్ కు వెళ్లనున్నాయట.


ఇండియా టీమ్ ఆడనున్న మ్యాచుల్లో ఈ రెండు కుటుంబాలు మంచి సందడి చేయనున్నాయని సమాచారం. ఒకవేళ ఇండియా సెమీస్ కు చేరితే తమ టూర్ కొనసాగించి వాటిని కూడా వీక్షించే ఆలోచన చేస్తున్నారట. ఇక ఇప్పటికే మహేష్ మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఫ్రీ గానే ఉన్నాడు కనుక మహేష్ కు ఇది పెద్ద సమస్య కాదనే చెప్పాలి. ఎందుకంటే అయన అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా ప్రారంభానికి మరికొంత సమయం ఉంది కాబట్టి.

ఇకపోతే వెంకటేష్ మాత్రం వెంకీ మామ సినిమా షూటింగ్ కోసం మధ్యలో డేట్స్ ఎడ్జస్ట్ చేసుకుంటున్నారట. ఆ విధంగా మన చిన్నోడు, పెద్దోడు ఇద్దరూ కూడా రాబోయే వరల్డ్ కప్ లో సందడి చేసి మన టీమ్ కి మంచి జోష్ ఇవ్వనున్నారని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో యూకేలోని సూపర్ స్టార్ మరియు విక్టరీ ఫ్యాన్స్ వారికి సాధర ఆహ్వానం పలికేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.... 


మరింత సమాచారం తెలుసుకోండి: