మహేష్ బాబు హీరోగా చేస్తున్న మహర్షి సినిమా ఈనెల 9 వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనుకున్నట్టుగానే సినిమా సినిమా నాలుగు రోజుల్లోనే వందకోట్ల పైగానే వసూలు చేసింది. నెక్స్ట్ టార్గెట్ 200 కోట్ల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా గురించి గతంలో నిర్మాతల్లో ఒకరైన పివిపి ఓ మాట చెప్పాడు.
మహర్షి సినిమా సూపర్ హిట్ అవుతుందని, మే 18 వ తేదీన విజయవాడలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని నిర్మాత చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మాట ఇప్పుడు నిజం కాబోతున్నది. విజయోత్సవ సభలకు మహేష్ హాజరు కావడం చాలా తక్కువ. సినిమా రిలీజ్ తరువాత సినిమా ప్రమోషన్స్ కంటే ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్ సడెన్ గా నిర్మాతల మాటకు కట్టుబడి తన విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకున్నాడు.
అయితే, ఈ విజయోత్సవ సభను విజయవాడలో ఎక్కడ నిర్వహించబోతున్నారు... ఎలా నిర్వహించబోతున్నారు అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న మహర్షి యూఎస్ మాత్రం అనుకున్నంతగా వసూళ్లు రాకపోవడం విశేషం. దీనికి కారణాలు లేకపోలేదు. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా సూపర్ హిట్ కావడంతో అమెరికా వంటి దేశాల్లో హవా కొనసాగుతోంది.