యువరత్న బాలకృష్ణ హీరోగా గత ఏడాది సంక్రాంతి  కానుకగా వచ్చిన జైసింహా సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కెఎస్ రవికుమార్ పనితనం నచ్చడంతో బాలయ్య ఆయనకు మరొక్కసారి అవకాశం ఇచ్చారు. నిజానికి ఇప్పటికే బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కావలసి వుంది, అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా ప్రస్తుతానికి ఆగిపోవడంతో, బాలయ్య రవికుమార్ సినిమాకు పచ్చ జండా ఊపారు. ఇక ఈ సినిమాకు కూడా జైసింహా కు నిర్మాతగా వ్యవహరించిన సి కళ్యాణ్ మరొక్కసారి నిర్మాతగా వ్యవహరించనున్నారు. 



బాలకృష్ణ ఇందులో మంచి పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారని, ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ అనుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండడంతో అందులో ముఖ్య కథానాయికగా ఆర్ ఎక్స్ 100 మూవీ ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ని చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భామ ఆర్డీఎక్స్ అనే సినిమాలో నటిస్తోంది, ఈ సినిమాకి కూడా నిర్మాత సి కళ్యాణ్ కావడం, ఆమె నటనతీరు ఆయనకు నచ్చడం, అలానే బాలయ్య సినిమాలో పాత్రకు సరిగ్గా పాయల్ సరిపోతుందని భావించి ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం జరిగిందట. ఇక పాయల్ బాలయ్య పక్కన సరిగ్గా సరిపోతుందని దర్శకుడి సహా యూనిట్ మొత్తం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 



ఇక ప్రస్తుతం మరొక హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోందట. అతి త్వరలో అధికారికంగా ప్రారంభోత్సవం జరుగుపుకోనున్న ఈ సినిమాకు సంగీతం చిరంతన్ భట్ అందిస్తున్నారు. కాగా చిత్రంలో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు చిత్ర ప్రారంభోత్సవం నాడు అధికారికంగా వెల్లడికానున్నాయి. మరి మరొక్కసారి బాలయ్య, కే ఎస్ రవికుమార్ కలయికలో చేస్తున్న ఈ సినిమాతో హిట్ కొడతారో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచిచూడాల్సిందే. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: