మిల్కీ బ్యూటీ తమన్న భాటియా లీడ్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'ఖామోషి'.  ఈ సినిమాలో ప్రముఖ కొరియో గ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నాడు.  ఈ సినిమాలో తమన్నా చిత్రకారిణి పాత్రలో నటిస్తోంది. భూమిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 31 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.


గతంలో తమన్న-ప్రభుదేవ కాంబినేషన్‌లో వచ్చిన 'అభినేత్రి' అటు తమిళంలో ఇటు తెలుగులో అద్భుతమైన కమర్షియల్ సక్సస్ ను సాధించింది. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అభినేత్రి-2' కూడా రూపొందబోతోంది. అందుకే తమన్న-ప్రభుదేవ కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొల్పింది. 

అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే 2016 లో రిలీజ్ అయిన హాలీవుడ్ థ్రిల్లర్ 'హష్' కు కాపీ అనే మాట వినిపిస్తోంది.  'ఖామోషి' ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది నెటిజనులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  సినిమా రిలీజ్ అయితే కానీ మనకు ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రాదు. ఏదేమైన ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రస్టింగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
  



మరింత సమాచారం తెలుసుకోండి: