లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన నటి కాజల్, ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఇక అనంతరం దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ మగధీరలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా అద్భుత విజయం తరువాత కాజల్ కు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఇక అక్కడినుండి కెరీర్ పరంగా ఆమె వెనక్కై తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఇక ఆపై ఆమె టాలీవుడ్ లోని దాదాపుగా అందరూ అగ్రహీరోల సరసన నటించి మంచి పేరు, క్రేజ్ సంపాదించి అనతికాలంలోనే టాలీవుడ్ లోని అగ్ర కథానాయికల్లో ఒకరుగా ఎదిగారు. ఇక ఇటీవల కాజల్ నటించిన సినిమాలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఆమె తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సీత అనే సినిమాలో హీరోయిన్ గా మెయిన్ రోల్ లో నటిస్తున్నారు. క్యారెక్టర్ పరంగా మంచి స్కోప్ ఉన్న పాత్రలో ఆమె నటిస్తున్నారని ఆ చిత్ర యూనిట్ చెపుతోంది. ఇక రెండురోజుల క్రితం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దర్శకుడు తేజ కాజల్ గురించి మాట్లాడుతూ, తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లను పరిచయం చేశానని, అయితే అందరిలోకి తనకు కాజల్ అంటే ప్రత్యేకమైన అభిమానమని అన్నారు. నిజానికి లక్ష్మి కళ్యాణం సినిమాకు ముందు ఆమె ఒక బాలీవుడ్ సినిమాలో నటించినప్పటికీ కూడా తమ సినిమాలోని లక్ష్మి పాత్ర కోసం కాజల్ ఎంతో కష్టపడిందని అన్నారు. ఇక ఆ తరువాత నటిగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా నన్ను మర్చిపోలేదని అన్నారు. ఇటీవల రానా హీరోగా తాను దర్శకత్వం వహించిన నేనేరాజు నేనేమంత్రి సినిమాలో హీరోయిన్ గా ఆమెను తీసుకోవాలి అని అడగడానికి వెళ్ళినపుడు ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒప్పుకుందని, నిజానికి ఇప్పటి హీరోయిన్ల లో ఏక్కువమంది సక్సెస్ఫుల్ దర్శకుల వెంటపడుతుంటారని,

అయితే అలా కాకుండా కాజల్ తనకు లైఫ్ నిచ్చిన వారిని ఎప్పటికి మరిచిపోదని, అందుకే నేను ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ కూడా నాతో సినిమాకి ఒప్పుకుందని అన్నారు. అందుకే ఆమెను ఒక హీరోయిన్ అని అనడం కంటే, అంతకుమించిన  గొప్పమనసు, వ్యక్తిత్వం గల మనిషి అని అనవచ్చని అన్నారు. ఇక మొదటినుండి కాజల్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే ఆమెను సీత సినిమాలో తీసుకోవడం జరిగిందని అన్నారు. అయితే ఇందులో ఆమె మొదటిసారి మంచి పవర్ఫుల్ పాత్రలో నటిస్తోందని, క్యారెక్టర్ పరంగా ఈ పాత్ర ఆమెకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టడం ఖాయమని తేజ అన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది, రేపు విడుదల తరువాత అన్ని అంచనాలు అందుకుని సినిమా తప్పకుండా మంచి విజయం సాదిస్తుందని తేజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..... !!!


మరింత సమాచారం తెలుసుకోండి: