వైజాగ్ బీచ్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన  సినీ ప్ర‌ముఖులు దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను తిల‌గించ‌డం జ‌రిగింది. అయితే దీనికి ప్ర‌ధాన కారణం కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌లు తొలగించారని రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆరోపించారు. నేడు ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ, ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, దాసరి కుమారుడు అరుణ్, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వీళ్ళు వైసీపీకి స‌పోర్ట్ చేయాడాన్ని ఆయ‌న‌ సహించలేక చంద్రబాబు ఇలా చేశారని ఆరోపించారు.


వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను వ్యాఖ్యానించడంతో తన పైనా చంద్రబాబుకి కోపముందని, ఆ కారణంగానే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. బీచ్ రోడ్డులో మరెందరివో విగ్రహాలున్నాయని వాటిని వదిలేసి ఈ మూడు విగ్రహాలపైనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు కోర్టులో కేసు వేశారని యార్లగడ్డ ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు వాటిని తొలగించడానికి ఎందుకు ఆదేశించారో చెప్పాలని నిలదీశారు.


ఏది ఏమైన‌ప్ప‌టికీ ఏఎన్నార్‌లాంటి మ‌హానుభావుడు, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రినారాయ‌ణ‌రావు, నంద‌మూరి హ‌రికృష్ణ‌లు ఇండ‌స్ర్టీ పెద్ద‌లు వీళ్ళ విగ్ర‌హాల‌ను తొల‌గించ‌డం చాలా త‌ప్పు. అంతేకాక దీనికి రాజ‌కీయ‌రంగు పులుముతున్నారు. ఇంత ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని కొంద‌రు సినీ పెద్ద‌లు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: