సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన నూతన చిత్రం మహర్షి. కెరీర్ పరంగా మహేష్ కు 25వ సినిమాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే భారీ హిట్ రేంజికి దూసుకుపోతోంది. టాలీవుడ్ లోని ముగ్గు అగ్ర నిర్మాతలు పివిపి, దిల్  రాజు,అశ్విని దత్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం అనే చెప్పాలి. ఇకపోతే మొన్న మే 9 న విడుదల అయిన ఈ సినిమాకు తొలిరోజు కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కూడా రెండవ రోజు నుండి సినిమాకు దాదాపుగా పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక అప్పటినుండి మహర్షి వసూళ్ల సునామీ ఆగడం లేదు. నిజానికి నైజామ్, గుంటూరు, కృష్ణ మరియు మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పిన మహర్షి

ఇప్పటికీ చాలా చోట్ల స్టడీ గానే మంచి కలెక్షన్లు రాబడుతున్నాడు. ఒకరకంగా మరే చిత్రం కూడా దీనికి ప్రస్తుతం పోటీ లేకపోవడం, అందునా వేసవి సెలవలు కావడంతో, స్టూడెంట్స్  మరియు ఫ్యామిలీస్ ఈ చిత్రాన్ని చూడడానికి ఎగపడుతున్నారు. ఇకపోతే ఓవర్సీస్ మరియు సీడెడ్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా కొంత వెనకపడినట్లు చెప్తున్నప్పటికీ కూడా టోటల్ గా చిత్రం క్లోసింగ్ సమయానికి మంచి షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెపుతున్నారు. ఇప్పటికే మొదటి వారం పరంగా మహేష్ బాబు సినిమాల్లో అత్యధిక కలెక్షలు రాబట్టిన ఈ సినిమా దాదాపుగా క్లోసింగ్ సమయానికి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. 

ఇక ఒకరకంగా ఇది మహేష్ బాబు కలెక్షన్ల సునామీకి మరొక నిలువుటద్దం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా విజయోత్సాహాన్ని పురస్కరించుకుని మహర్షి చిత్రం యూనిట్ ఈ నెల 18న ఆంధ్ర వాణిజ్య రాజధాని విజయవాడలో ఈ చిత్ర విజయోత్సవ వేడుకను అభిమానులు మరియు అతిథుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక మహర్షి అద్భుత విజయంతో మహేష్ బాబు అభిమానుల ఆనందాలకు అవధులు లేవని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో మహర్షి ఎంత మేర కలెక్షన్లు కొల్లగొట్టి ఎంతటి ఘనత సాధిస్తాడో వేచి చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: