ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో మోహన్ లాల్, ప్రకాశ్ రాజ్ నటించిన ‘ఇద్దరు’సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది మోడల్, విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి హిట్ సినిమాల్లో నటించిన ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడింది.  పెళ్లైన తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.  ఆ మద్య మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.  కాకపోతే ఆమె నటించిన ఏ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు.  ప్రస్తుతం తన కూతురు విషయంలో శ్రద్ద తీసుకుంటున్న ఐశ్వర్యారాయ్ మరోసారి వెండి తెరపై మెరవనుంది. 

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ హిస్టారికల్ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. చోళ రాజుల కాలంలో నడిచే కథతో ఆయన తన కొత్త సినిమా తీస్తున్నారు. ఈ సినిమా పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ కథను మణిరత్నం రూపొందించారు. 

ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో విజయ్ సేతుపతి, జయం రవి, అనుష్క, కీర్తి సురేష్ నటించనున్నారు. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించబోతున్నారట...అయితే ఈ పాత్ర నెగిటీవ్ షేడ్ లో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ పాత్రే కథను కీలక మలుపు తిప్పుతుందని తెలుస్తోంది. ఈ మూవీ మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: