ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. గాన గంధర్వుడు.. ఇప్పుడంటే.. చాలా మంది సింగర్లు వినిపిస్తున్నారు. కనిపిస్తున్నారు... కానీ ఓ ఇరవయ్యేళ్ల క్రితం సినీ గాయకుడు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాత్రమే వినిపించారు. మొత్తం తెలుగు సినీ పరిశ్రమలోని పాటల్లో దాదాపు 80 శాతానికి పైగా ఆయనే పాడేవారంటే అతిశయోక్తి లేదు.


హీరోల గొంతు మాడ్యులేషన్ ను బట్టి..వారికి అనుకూలంగా.. తెరపై వారే పాడారా అనిపించేలా పాడటంలో బాలూది ప్రత్యేక శైలి. అలాంటి బాలసుబ్రహ్మణ్యాన్ని అప్పట్లో ఓ హీరోయిన్ మై డ్రీమ్ బాయ్ అంటూ కామెంట్ చేసిందట. అలా బహిరంగంగా తన అభిమానాన్ని చాటుకుందట. 

ఓ సంగీత కార్యక్రమంలో బాలు వేదికపై ఈ విషయాన్ని ప్రేక్షకులతో సరదాగా పంచుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమె సుమలత. తెలుగులో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన సుమలత ఆ తర్వాత కన్నడ హీరో అంబరీశ్‌ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌ బై చెప్పారు. 

ఇటీవలే ఆమె భర్త కన్నుమూశారు. ఆమె తన భర్త పోటీ చేసిన మాండ్య నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఆమె భర్త కన్నుమూసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సుమలత జీవితం సాఫీగా సాగిపోవాలని ఆకాంక్షించారు బాలు. ఆమె రాజకీయాల్లోకి రాకుండా ఉంటే బావుండేదన్న బాలు.. తాను కోరుకున్న రంగంలో రాణించాలని కోరుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: