అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నానీ కలిసి ఇటీవల 'దేవదాస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన సినిమా అయినప్పటికి ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత నానీ 'జెర్సీ' సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా తన ఇమేజ్ కి భిన్నంగా చేసి మరో సారీ నాని తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు ఇదే ఊపుతో విక్రం కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


ఈ సినిమాకు సమాంతరంగా నాగార్జున 'మన్మథుడు-2' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. మన్మథుడు సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, సమంత, కీర్తి సురేష్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. ఇక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో నాగ్ ఎలాగైనా గట్టి హిట్ ను దక్కించుకోవాలని ప్లాన్ చేసుకొని మరీ ఈ సినిమాను ఆగస్ట్ చివరి వారంలో రీలీజ్ చేయడాని సన్నాహాలు చేసుకుంటున్నారు.


'గ్యాంగ్ లీడర్' చిత్ర విడుదల తేదీని ప్రకటించి నాని అండ్ టీం షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో పడితే ఇదే సమయంలోనే 'మన్మథుడు-2'చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు 'మన్మథుడు-2' ను ఆగస్టు చివర్లో విడుదల చేయాలని భావించారు. త్వరలోనే ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా 'గ్యాంగ్ లీడర్' సినిమా విడుదల తేదీ ప్రకటన వచ్చింది. దాంతో 'మన్మథుడు-2' సినిమాను ఎప్పుడు విడుదల చేయాలా అనే ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: