‘అర్జున్ రెడ్డి’ 'పెళ్లి చూపులు' చిత్రాలతో మంచి నటుడుగా పేరు  తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ప్రియదర్శిలు కలిసి హీరోలుగా   ఆమద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మిఠాయి'  ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈమూవీ విజయవంతం  అవుతుందని చాలా మంది ఆశించారు. ఈఇద్దరు కమెడియన్స్ కడుపుబ్బ నవ్వించడం ఖాయం అని కూడ భావించారు. కానీ ఆ సినిమా అంచనాలకు విరుద్ధంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.  

ఈసినిమా విడుదలైన రెండవ రోజు రాహుల్ మీడియా ముందుకు వచ్చి ప్రేక్షకులు తమ పై పెట్టుకున్న అంచనాలను రీచ్ అవ్వలేకపోయాం అని అంటూ ఇకపై ఇలా జరుగకుండా చూసుకుంటామని మంచి సినిమాల్లో చేస్తానంటూ ఓపెన్ ప్రకటన కూడ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలైన రెండవ రోజే రాహుల్ ఈ ప్రకటన చేయడంతో ఈమూవీ దర్శకుడు ప్రశాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేస్తూ ఆసమయంలో రాహుల్ తీరుపై ప్రశాంత్ తీవ్ర విమర్శలు చేశాడు. 

‘మిఠాయి' లొల్లి పూర్తి యిందని భావిస్తున్న తరుణంలో మరోసారి ఈ వివాదం మీడియా ముందుకు వచ్చింది. రాహుల్ వ్యక్తిత్వం అంత మంచిది కాదంటూ మిఠాయి మూవీ అఫిషియల్ ఫేస్ బుక్ పేజీలో మిఠాయి విత్ రాహుల్ రామకృష్ణ అనే పేరుతో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో రాహుల్ రామకృష్ణ పై సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఆపోస్ట్ చేసింది ఎవరో తెలియకపోయినా రాహుల్ రామకృష్ణ గురించి సంచలన విషయాలు ఆ పోస్ట్ లో ఉన్నాయి. 

‘మిఠాయి’ చిత్రం షూటింగ్ సమయంలో ఇంకా పలు సందర్బంలో రాహుల్ రామకృష్ణ ‘భరత్ అనే నేను’ చిత్రంలో తన  పాత్రను తగ్గించారు. లేదంటే మహేష్ బాబు కంటే ఎక్కువ పేరు తనకు వచ్చేది అంటూ కామెంట్స్ చేసిన విషయాన్ని ఆ పోస్ట్ లో వివరించడం సంచలనంగా మారింది. అంతేకాదు మహేష్ బాబు ప్రత్యేకంగా చెప్పి మరీ తన పాత్రను ట్రిమ్ చేయించాడు అంటూ రాహుల్ చాలామందితో అన్నట్లుగా ఆ పోస్ట్ బట్టి అర్ధం అవుతుంది. అయితే ఈ ఆరోపణలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఈ ‘మిఠాయి’ రగడలో అనుకోకుండా మహేష్ బాబు ఇరుక్కోవడం సంచలనంగా మారింది..    



మరింత సమాచారం తెలుసుకోండి: