టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీ గురించే టాక్ నడుస్తుంది.  మహేష్ బాబు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు..ఇది నా 25వ సినిమా మంచి హిట్ కావాలని..ప్రేక్షకులు ఆదరించాలని..అందుకోసం మంచి కథతో మీ ముందుకు వస్తానని అన్నారు.  అన్నట్లు గానే వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మహర్షి’ రైతులకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ప్రేక్షకాధరణ పొందింది. 


ఈ సినిమా చూసిన వారు చాలా మంది వీక్ ఎండ్ గ్రామాల్లోకి వెళ్లి వ్యవసాయం చేస్తున్నారంటే..ఏ రేంజ్ లో ప్రభావం చూపించి ఉంటుందో ఊహించుకోవొచ్చు.  తాజాగా ఈ సినిమా విజయవంతమైతే కనకదుర్గ అమ్మవారి సన్నిధికి వస్తానని మహేష్ మొక్కుకున్నారట. సినీనటుడు మహేశ్ బాబు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. మహర్షి సినిమా యూనిట్ మొత్తం కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


అనంతరం విజయవాడలోనే జరిగే మహర్షి మూవీ సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం పాల్గొన్నారు.  ఆలయానికి విచ్చేసిన ఈ బృందానికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మహేశ్‌బాబు, మహర్షి చిత్ర బృందాన్ని సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. విజయవాడకు వచ్చిన మహేశ్‌, వంశీ పైడిపల్లి,  దిల్‌రాజు తదితరులను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.  సిద్దార్థ కళాశాలలో ‘మహర్షి’ చిత్ర విజయోత్సవ వేడుకల్లో చిత్రబృందం సందడి చేయనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: