సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మహర్షి హిట్ జోష్ లో ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వచ్చిన మహర్షి సినిమా మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా దూసుకెళ్తుంది. ఈ సినిమా విజయోత్సవం విజయవాడలో శనివారం సాయంత్రం అభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. మహర్షి తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లో మహేష్ సినిమా చేస్తున్నాడు.


అయితే మహర్షితో తన స్టామినా ఏంటో చూపించిన మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన 24 సినిమాల గురించి ప్రస్థావించాడు. ముందుగా మురారి సినిమా మహేష్ ప్రథావనకు వచ్చింది. కృష్ణవంశీ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా సంచలన విజయం అందుకుంది. అయితే ఈమధ్య డైరక్టర్ కృష్ణవంశీ బాగా వెనుకపడ్డాడు.


రీసెంట్ గా ఫ్యాన్స్ తో జరిగిన చిట్ చాట్ లో కృష్ణ వంశీ మహేష్ మురారి పార్ట్ 2 గురించి ఫ్యాన్స్ అడుగగా స్పందించాడు. మహేష్ తో మురారి 2 ఏమి అనుకోలేదని ఒకవేళ అలాంటి కథ వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు కృష్ణ వంశీ. మురారి సినిమా మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ మూవీ.


మహేష్ అనీల్ రావిపుడి సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే మహర్షి కాదు బాహుబలి రికార్డులను సైతం తిరగరాసేలా ఆ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. మహర్షి హిట్ తో మహేష్ మే నెల బ్యాడ్ సెంటిమెంట్ కూడా క్రాస్ చేయడం జరిగింది. సో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామాతో మహర్షి మరిన్ని సంచలనాలు సృష్టించబోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: