బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరు ఊహించని విధంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో సినిమా మొదలు పెట్టాడు. మెగా నందమూరి మల్టీస్టారర్ గా వస్తున్న ఆర్.ఆర్.ఆర్ మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొద్దిపాటి గ్యాప్ తో కొత్త షెడ్యూల్ కు సిద్ధమవుతుంది.


అయితే సినిమా మొదలైన నాటి నుండి కొన్ని అనుకోని సంఘటనల వల్ల షూటింగ్ లేటవుతూ వచ్చింది. అందుకే ఇక మీద అలా జరుగకుండా సినిమాకు అనుకున్న ప్రకారం షెడ్యూల్ ఫాలో అయ్యేలా రాజమౌళి స్ట్రిక్ట్ గా ఉన్నాడట. తారక్, చరణ్ లకు కూడా ఈ విషయం గురించి చెప్పినట్టు తెలుస్తుంది.


ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇద్దరు రియల్ హీరోస్ ను తీసుకుని అందులో ఓ ఫిక్షన్ కథను చెప్పబోతున్నారు. 400 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. అలియా భట్ ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. జరిగిన షూటింగ్ వరకు అనుకున్న విధంగా పర్ఫెక్ట్ గా ఉందట. 


అయితే సినిమా ఎనౌన్స్ చేసిన ప్రెస్ మీట్ లోనే జూలై 30 2020 రిలీజ్ అంటూ రాజమౌళి చెప్పడం జరిగింది. అందుకే జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగతా ఆరు నెలలు చేయాలని ప్లాన్ చేశారు. మరి ఆర్.ఆర్.ఆర్ అనుకున్నట్టుగానే అన్ని సంచలనాలు సృష్టిస్తుందా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: