సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సూపర్ హిట్ మహర్షి, ప్రస్తుతం దాదాపుగా అన్నిచోట్లా తన కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తూ సెన్సేషనల్ హిట్ దిశగా సాగుతోంది. ఇక ఈ చిత్ర విజయోత్సవం నిన్న విజయవాడలో ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకలో హీరో సూపర్ స్టార్ మహేష్ తో సహా చిత్ర యూనిట్ మొత్తం ఎంతో ఆనందంతో సందడి చేసిందనే చెప్పాలి. ఇది నిజమైన ఎపిక్ బ్లాక్ బస్టర్ అని, ఇటువంటి విజయాన్ని ఇచ్చిన నా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మహేష్ బాబు మాట్లాడుతూ చెప్పారు. 

ఇకపోతే మరోవైపు ఇప్పటికే రూ.150 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసిన మహర్షి సినిమా, మరికొద్దిరోజుల్లో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకునే అవకాశాలు కనపడుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ సినిమా ఒకటి, రెండు ప్రాంతాల్లో కాస్త తక్కువ కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ కూడా, మిగతా అన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా తన హవాను కొనసాగిస్తోంది. అంతేకాదు నైజాం లో అయితే ఈ సినిమా మరొక సరికొత్త రికార్డును నెలకొల్పే దిశగా సాగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా రూ.206 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి మహేష్ సినిమాల్లో మంచి రికార్డు నెలకొల్పింది. 

అయితే రాబోయే రోజుల్లో మహర్షి ఓవర్ ఆల్ గా క్లోసింగ్ సమయానికి ఆ రికార్డును అందుకునే అవకాశాలు కూడా లేకపోలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రస్తుతం విడుదలైన, అలానే మరికొద్దిరోజుల్లో విడుదల కానున్న చిన్న సినిమాల వలన మహర్షికి వచ్చే పెద్ద నష్టం ఏమి లేదని, ఇదే కలెక్షన్ల ఊపు కనుక ఈ సినిమా కొనసాగిస్తే, అతిత్వరలో రూ.200 కోట్ల మార్కును సునాయాసంగా అందుకుంటుందని అంటున్నారు. మహర్షి రాబోయే రోజుల్లో అంతటి గొప్ప రికార్డును అందుకుంటాడో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి ఉండక తప్పదు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: