బాహుబలి సిరీస్ సినిమాలతో యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ పేరు నేషనల్ వైడ్గా మార్మోగింది. ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్ దర్శక,నిర్మాతలు సైతం వెయిటింగ్లో ఉన్నారు. తాజాగా ప్రభాస్ నటిస్తోన్న సాహో, జాన్ సినిమాలు రెండూ కూడా నేషనల్ మార్కెట్నే దృష్టిలో ఉంచుకుని భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేస్తాడన్న ఆసక్తి ఉన్నప్పుడే మనోడు సాహో, జాన్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాడు.
సాహో ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న సాహో బడ్జెట్ రూ.200 కోట్ల పై మాటే అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో తెలుసుకుంటున్నారు. ఇక సాహో అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్కు ముహూర్తం జూన్లో కుదిరిందని తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి ఫస్ట్ పార్ట్ ట్రైలర్ కూడా జూన్లో వచ్చి నేషనల్ వైడ్గా సంచలనాలు రేపింది.
ఇప్పుడు బాహుబలి 1 ట్రైలర్ కూడా 2015 జూన్ నెలలోనే విడుదలై భారతదేశం అంతటా ప్రకంపనలు రేపింది. ఇప్పుడు సాహోకు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్. రన్ రాజా రన్ ఫేం సుజీత్ ఈ సినిమాకు డైరెక్టర్. సాహోకు శంకర్ ఈషన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి బాహుబలి సెంటిమెంట్తో వస్తోన్న సాహో బాహుబలి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా ? అన్నది చూడాలి.