ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒక్కటే పేరు... మహేష్... మహర్షి... ఎవరు చర్చించుకుంటున్నా ఈ సినిమా గురించే.   ఇంతగా ప్రజలను ఇన్స్పైర్ చేసిన సినిమా వచ్చి చాలాకాలం అయ్యింది.  ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావంతో జనాల్లోకి చాలా ఫాస్ట్ గా వెళ్ళింది ఈ సినిమా.  వీకెండ్ ఫార్మింగ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.  


మహేష్ 26 వ సినిమా అనిల్ రావిపూడితో కమిట్ అయ్యాడు.  వచ్చే నెలలో సినిమా ప్రారంభం కాబోతున్నది.  దీనిపై అంచనాలు ఇప్పటి నుంచే పెట్టుకున్నారు అభిమానులు.  వాళ్ళను అలరించే సినిమా ఇవ్వాలి అనిల్ రావిపూడి.  ఖచ్చితంగా అందరికి నచ్చే సినిమానే తీస్తానని అంటున్నాడు అనిల్.  


ఈ సినిమా తరువాత పరశురామ్ సినిమా లైన్లో ఉంది.  గీత గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న పరశురామ్... మహేష్ తో సినిమా చేస్తానని ఖచ్చితంగా చెప్తున్నాడు. రీసెంట్ గా మహేష్ ను కలిసి కథ వినిపించాడు.  నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట.  మహేష్ 27 వ సినిమా పరశురామ్ తోనే ఉంటుందని చెప్పలేం గాని, ఉండినా ఆశ్చర్యపోనవసరం లేదు.  


పైగా పరశురామ్ సినిమాను అల్లు అరవింద్ చేయాలి కాబట్టి ఈ ఛాన్స్ ను అల్లు అరవింద్ కూడా వదులుకోడు.  పరశురామ్ మహేష్ కు చెప్పిన కథ ఇదే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.  కథ ప్రకారం మహేష్ తల్లి ఓ బ్యాంక్ ఉద్యోగి.   విలన్ చేసిన మోసం కారణంగా ఆమె ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది.  ఎలాగైనా ఆ విలన్ ను పెట్టుకోవాలనే కసితో మహేష్ విదేశాలకు వెళ్తాడు.  అక్కడ ఎలా విలన్ ను పట్టుకున్నాడు అన్నది కథ అని ప్రచారం జరుగుతున్నది.  ఈ కథ చదువుతుంటే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో గుర్తుకు వస్తుంది.  మహేష్ కు ఈ విషయం తెలియదా... తెలియకుండానే ఒప్పుకుంటాడా చెప్పండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: