ఆ మద్య హీరో రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో నటించిన గాయత్రి గుప్తా తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది.  ఆ తర్వాత ఫిదా, ఐస్ క్రీమ్, మిఠాయి సినిమాల్లో నటించింది.   గాయత్రీ గుప్తా తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా కనిపించింది.  నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం తీసుకు వచ్చిన సమయంలో  గాయత్రీ గుప్తా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.  సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని..కాకపోతే ఆ విషయంలో నటీమణులు కూడా జాగ్రత్త వహించాల్సి ఉందని..వారి అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఇటీవల సహజీవనం గురించి మాట్లాడుతూ..అబ్బాయి..అమ్మాయి కి ఇష్టమైతే సహజీవనం చేయడంలో తప్పులేదని..ఇతర అక్రమ సంబంధాల కన్నా ఇది బెటర్ అని అన్నారు.  సినిమాల్లో కన్నా ఇతర విషయాల్లో ఎప్పుడూ కాంట్రవర్సీ చేస్తున్న గాయత్రి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.   ఆడవాళ్ల వస్త్రధారణపై సంచలన కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. రేప్ లు ఎక్కువగా ఎందుకు జరుగుతాయంటే.. సెక్సువల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవ్వడం వల్లే అని చెబుతోంది గాయత్రి. 


ఆకలిగా ఉన్నప్పుడు తిండి దొరకకపోతే మనిషి ఏం చేస్తాడో.. సెక్స్ కోరికలు కలిగినప్పుడు ఒత్తిడితో తప్పు అని తెలిసినా.. రేప్ చేస్తున్నారని.. అంతేతప్ప అమ్మాయి వేసుకున్న డ్రెస్ వలన కాదని చెప్పుకొచ్చింది.  ఒళ్లు దాటి బయటకి వచ్చావంటే ధైర్యం చేసినట్లేనని.. అది సినిమా ఇండస్ట్రీ అయినా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగమైనా.. ఒకటే అని ఎక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడు రోజులు మారాయని..అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు అన్ని రంగాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని..వారి స్వశక్తితో బతుకుతున్నారని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: