యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ హీరోగా నూతన చిత్రం ఎంతో సింపుల్ గా లాంచ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రూపొందుతున్న బై లింగ్వల్ మూవీ ని  'హీరో' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివతో పాటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అతిధులుగా వచ్చి చిత్ర బృందానికి శుభాకాంక్షకలు తెలిపారు. 


హీరోయిన్ గా 'పేట' ఫేమ్ మాళవిక మోహనన్ టాలీవుడ్ కు పరిచయమవుతోంది. బైక్ రేస్ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసమే ఇటీవలే ప్రత్యేకంగా ఫోటో షూట్ చేశారట. ఈ ఫోటో షూట్లో విజయ్ దేవరకొండ లుక్స్ బైక్ రైడర్ గా పర్ఫెక్ట్ గా సూట్ అవుతున్నాడని సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'హీరో'ని తెలుగుతో  పాటు తమిళంలోనూ ఒకేసారి రూపొందిస్తున్నారు.

'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ మైత్రి మూవీస్ కి చేస్తున్న రెండో సినిమా ఇది. యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ బ్యాడ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. 
హీరో టైటిల్ తో గతంలో మెగాస్టార్ చిరంజీవి, నితిన్ సినిమా చేశారు. అంతేకాదు బాలీవుడ్‌లో జాకీ ష్రాఫ్ ని స్టార్ చేసింది ఈ టైటిల్ తో వచ్చిన సినిమానే. మరి ఇది విజయ్ దేవరకొండ రేంజ్ ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. ఇక 'డియర్ కామ్రేడ్' పూర్తి కాగానే ఈ సినిమా ప్రారంభం కానుందని లేటెస్ట్ అప్‌డేట్. 


మరింత సమాచారం తెలుసుకోండి: