మహేష్ బాబు తాజాగా ఇటీవల నటించిన 'మహర్షి' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ భారీ కలెక్షన్లు సృష్టించిన నేపథ్యంలో మహేష్ సక్సెస్ సంబరాలు ఓ రేంజ్ లో చేసుకుంటున్నారు. ముఖ్యంగా తన కెరీర్లో 25వ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవడంతో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఎన్నడూ లేనివిధంగా సక్సెస్ ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు మహేష్.


అయితే మరో పక్క మహేష్ తన తర్వాత సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభించడానికి రెడీ అయిపోయినట్లు సమాచారం. సినిమాని ఎలాగైనా ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి వచ్చే సంవత్సరం 2020 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఆ తర్వాత మహేష్ గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో నటించాల్సి ఉంది.


ఈ చిత్రం కూడా 2020 లోనే విడుదల కానుంది. ఒకే ఏడాది మహేష్ నటించిన రెండు చిత్రాలు విడుదలైన సందర్భాలు తక్కువ. గత కొన్నేళ్లుగా మహేష్ బాబు ఏడాదికి ఒక చిత్రంలోనే నటిస్తున్నాడు. ఇకపై మహేష్ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. ఇటీవల మహేష్ బాబు ఎక్కువగా సందేశాత్మక చిత్రాల్లో నటించాడు. ఇకపై కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తం మీద చూసుకుంటే 2020 సంవత్సరం తన అభిమానులకు డబుల్ సినిమాలతో ట్రీట్ ఇవ్వడం గ్యారంటీ అని అంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన వారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: