టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ రాకుల్ ప్రీత్ సింగ్. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కుర్రకారుని ఎంతగానో దోచింది. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాత్రమే గాక సౌత్ ఇండస్ట్రీలలో చాలాచోట్ల ఈ ముద్దుగుమ్మ కు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ కి  అవకాశాలు వచ్చినా చేసిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.


అయితే తాజాగా ఇటీవల సంచలన హీరో అజయ్ దేవగన్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన 'డి దే ప్యార్ దే' సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన మొదటిరోజు సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.


శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్వదేశంలో ఫస్ట్ వీకెండ్ లోనే దాదాపు 40 కోట్ల వరకు రాబట్టింది. రాకుల్ ప్రీత్ సింగ్ గతంలో 'యారియన్' మరియు 'ఐయరీ' వంటి హిందీ సినిమాలను చేసారు కానీ వాటిలో ఆమెకు గుర్తింపు పొందలేదు. తాజాగా అజయ్ దేవగన్ తో నటించిన సినిమా  'డి దే ప్యార్ డి' సక్సెస్ కావడంతో రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఖాతా తెరిచినట్లే ఇక వరుసగా అవకాశాలు రావటం ఖాయమని అంటున్నారు సినిమా విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: