‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఇప్పటివరకు కియారా అద్వానీ, రష్మికా మండన్నాల పేర్లు వినిపిస్తున్నాయి.  అలాగే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ రెండో వారంలో మొదలు కానుందని సమాచారం.


 ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్‌ హంగుల‌తో మంచి ల‌వ్‌స్టోరీస్‌ తీస్తుంటారు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌. పరుగు, ఆరెంజ్‌ అలాంటి చిత్రాలే. ప్రస్తుతం అఖిల్‌తో చేయబోతున్న స్క్రిప్ట్‌ కూడా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుందట. ఒకవైపు  భాస్కర్‌ కథ రెడీ చేస్తుంటే మరోవైపు ఇతర ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. పర్ఫెక్ట్‌ ప్లాన్‌తో జూన్‌లో సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించనున్నారు. 


ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 24న మొదలవుతుంది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. కైరా అద్వానీ, రష్మిక పేర్లు పరిశీలనలో వున్నాయి. తెలుగు ఇండ‌స్ర్టీకి ఎన్నో హిట్ల‌ను అందించిన గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో చేస్తున్నారు. మ‌రి ఇక ఈ సారైనా అఖిల్‌కి హిట్ వ‌స్తుందో లేదో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: