సూపర్ స్టార్ మహేష్ తో ఈమధ్యనే మహర్షి అంటూ ఓ సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ వంశీ పైడిపల్లి. ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుంది. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఇది నిలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో మహర్షి డైరక్టర్ వంశీ పైడిపల్లి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి.


వంశీ పైడిపల్లి లవ్ స్టోరీ గురించి తన మాటల్లోనే చెప్పాడు.. దాదాపుగా ఓ సినిమాకు కావాల్సిన ట్విస్టులన్ని వంశీ ప్రేమ కథలో ఉన్నాయనిపిస్తుంది. భద్ర సినిమాకు అసోసియేట్ డైరక్టర్ గా చేస్తున్నప్పుడు శ్వేత అనే కాస్టూం డిజైనర్ తో పాటుగా మాలిని కూడా షూటింగ్ కు వచ్చిందట. అక్కడ ఆమెను చూసి ఇష్టపడినట్టు చెప్పారు వంశీ.


ఇక శ్వేత ద్వారా ఆమె నంబర్ తీసుకోవడం మాట్లాడటం జరిగిందట. ఆమెతో మాట్లాడిన టైంలో వంశీ చాలా సంతోషంగా ఉండటంతో ఇది లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక ఒక టైంలో ఆమె బెంగళూరులో ఉన్నప్పుడు దిల్ రాజు కారు తీసుకుని మరీ వెళ్లి కాఫీ షాప్ లో ప్రపోజ్ చేశాడట వంశీ. అయితే ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇలాంటివి వద్దు అనగా మాలిని తన ప్రేమను వ్యక్తం చేశారట వంశీ పైడిపల్లి.


ఆ తర్వాత వాళ్ల ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. అదే టైంలో మొదటి సినిమా మున్నా ఆడలేదు. ఫైనల్ గా ఎలాగోలా వంశీ తన తండ్రిని ఒప్పించి అవతల వాళ్లతోనూ మాట్లాడించి పెళ్లి చేసుకున్నాడట. ఇది వంశీ పైడిపల్లి, మాలినిల లవ్ స్టోరీ. ప్రస్తుతం మహర్షి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న వంశీ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడో తెలియాల్సి ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: