తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి 2 తర్వాత ప్రభాస్ దాదాపు ఒక సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నారు.  యువ దర్శకుడు సుజిత్ తో ‘సాహూ’చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రం రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే.  అయితే ఈ చిత్రం షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా పెద్దగా లేవు.  ఆ మద్య ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న అప్ డేట్ ఇచ్చారు. 


తాజాగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ఈ రోజు ఒక సర్ ప్రైజ్ ఉంటుందని నిన్ననే ఒక వీడియో బైట్ ద్వారా ప్రభాస్ చెప్పాడు. అన్నట్టుగానే కొంతసేపటి క్రితం ఈచిత్రం నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు. డిఫరెంట్ లుక్ తో .. చాలా తీక్షణమైన చూపులతో ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. 'బాహుబలి 2' తరువాత ప్రభాస్ చేస్తోన్న చిత్రం కావడంతో, సహజంగానే అంచనాలు ఎక్కువగా వున్నాయి.


ఎంతోమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈచిత్రాన్ని, తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.  ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు.  ఈ చిత్రం కోసమే ప్రభాస్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: