సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా విశేషాలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో ప్రభాస్ పుట్టిన రోజు ఈ సినిమాకి సంబంధించిన చిన్నపాటి వర్కింగ్ వీడియో విడుదల చేసి సందడి చేసిన సినిమా యూనిట్ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫోటోలు విడుదల చేయడం జరిగింది. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ దాదాపు 200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎవిలిన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల సాహో సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ పై ప్రభాస్ లుక్ పై అనుష్క చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కువగా అరబ్ కంట్రీ లో షూటింగ్ జరుపుకుంది. ఆగస్టు 15వ తారీఖున రాబోతున్న ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ పై అనుష్క సోషల్ మీడియాలో ఈ విధంగా స్పందించింది.


సాహో సినిమా కి సంబంధించిన ప్రతి విశేషం నన్ను ఉత్కంఠకు గురిచేస్తోంది. నెక్స్ట్ ఏంటి అనే ఆసక్తి కలుగుతోంది. సాహో చిత్రం కోసం అంత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నా. ప్రభాస్, దర్శకుడు సుజిత్, యువి క్రియేషన్స్ సంస్థకు, ఈ చిత్రంలో పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్ కు ఆల్ ది బెస్ట్ అంటూ అనుష్క కామెంట్ చేసింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: