మెగాస్టార్ చిరంజీవి, ఈ ఒక్క చెపితే చాలు కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు ఎంతో పులకించిపోతాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, ఆ తరువాత కృష్ణ గారు, ఆపై తరువాతి తరానికి మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ హీరోగా కొనసాగి, ఇప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు. ఇక ఇటీవల అయన కంబ్యాక్ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 సినిమా రాబట్టిన కలెక్షన్లు, సృష్టించిన ప్రభంజనం కూడా తక్కువేమి కాదు. ఎంత వయసు పైబడినప్పటికీ కూడా మెగాస్టార్ యాక్షన్, మరియు డాన్స్ లో గ్రేస్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం అయన తన కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా మరొక్కసారి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఒకప్పటి తెలుగు విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై క్రేజ్ మరియు హైప్ తారాస్థాయికి చేరింది అనే చెప్పాలి. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ కొట్టడంతో ఈ సినిమా కోసం అన్ని ప్రాంతాల నుండి బయ్యర్లు ఎంతైనా పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇక మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్, చిత్రంపై మరింతగా అంచనాలు పెంచింది. అయితే ఈ చిత్రాన్ని మొదట స్వతంత్ర దినోత్సవం కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ కొంత జాప్యం కారణంగా దసరాకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తోంది చిత్ర యూనిట్. నిజానికి ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. 

సినిమాలో అంతర్లీనంగా ఉండే మంచి కథాంశం, ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, తప్పకుండా గత చిత్రాల వలె మెగాస్టార్ కు ఈ సినిమా తప్పకుండా మరొక విజయాన్ని అందించి తీరుతుందని కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వార్త కనుక ఒకవేళ నిజమే అయితే మెగా ఫ్యాన్స్ కు సైరా రూపంలో మరొక పండుగ ఖాయం అనే చెప్పవచ్చు...!!!. 


మరింత సమాచారం తెలుసుకోండి: