బాహుబలి వంటి భారీ విజయం తరువాత చాలా మంది సీనియర్ డైరెక్టర్లు ప్రభాస్ తో చేద్దామని భావించిన వారికి ఎవరికి అవకాశం ఇవ్వడానికి ప్రభాస్ సుముఖత చూపలేదు. ఎక్కువగా ఇండస్ట్రీలో ఉన్న కొత్తవారికి అవకాశాలు ఇవ్వటానికి ప్రభాస్ తన కెరియర్ లో ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమా కూడా సుజిత్ అనే కుర్ర డైరెక్టర్ తో కావడం ఇందుకు నిదర్శనం.


మరిముఖ్యంగా బాహుబలికి ముందు విడుదలైన మిర్చి చిత్రానికి కూడా కొరటాల దర్శకుడు. కొరటాల ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కావచ్చు. కానీ మిర్చి చిత్రమే అతడికి దర్శకుడిగా డెబ్యూ మూవీ. సాహో చిత్రాన్ని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. రాధాకృష్ణ కూడా పాపులర్ డైరెక్టర్ ఏమీ కాదు.రాధాకృష్ణ తర్వాత ప్రభాస్ సాయి మాధవ్ బుర్రా దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


సాయిమాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగ్ రైటర్ గా గుర్తింపు పొందారు. కానీ ఇంత వరకు ఒక్క చిత్రానికి కూడా దర్శకత్వం వహించలేదు. గతంలో కొందరు హీరోలతో సినిమాలు చేసేందుకు సాయిమాధవ్ బుర్రా ప్రయత్నించారు. కానీ సినిమా దిశగా అడుగులు పడలేదు.సాయిమాధవ్ బుర్రా చెప్పిన ఓ పవర్ ఫుల్ కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి సినిమా ప్రాజెక్టు పనులు చర్చల దశలో ఉన్నాయి.  

 



మరింత సమాచారం తెలుసుకోండి: