నేడు ఏపిలో ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అందరే షాక్ మీద షాక్ తింటున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు, కార్యక్తలు కిక్కురుమనే పరిస్థితిలో లేరు..ఎందుకంటే కనీ వినీ ఎరుగని రీతిలో వైసీపీ దూసుకు పోతుంది. ఇప్పటికే 175 కి 150 స్థానాల్లో ముందంజలో ఉంది. జగన్ విజయం ఖాయమనే విషయం తేలిపోయింది. దీంతో జగన్ పార్టీ కార్యాలయాల్లో సంబరాలు షురూ చేశారు.
జగన్ సైతం ఈ గెలుపు ముందే ఊహించామంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు జగన్ కి అప్పుడే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. రచయిత కోన వెంకట్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో జగన్ కి విషెస్ చెబుతూ.. మునుపెన్నడూ చూడని పాలన మీ నుండి ఆశిస్తున్నామని పోస్ట్ పెట్టారు.
కాగా ఈ పోస్ట్ పై నెటిజన్లు నెగెటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఏపీ ప్రజలను ఆ దేవుడే కాపాడాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. జగన్ పై ఉన్న నేర చరిత్రను కామెంట్స్ గా పెడుతున్నారు. దాంతో ఇప్పుడు జగన్ అభిమానులు రివర్స్ అవుతున్నారు. కోన పోస్ట్ జగన్, టీడీపీ అభిమానుల పెద్ద యుద్దమే జరుగుతుంది.